జమ్మూ కశ్మీర్లో సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది.

జమ్మూ కశ్మీర్లో సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది. అత్యాధునిక ఆయుధాలు, మోర్టార్లతో పూంఛ్ జిల్లాలో వాస్తవాధీన రేఖ వెంబడి బీఎస్ఎఫ్ పోస్టులు, గ్రామాలపై దాడిచేసింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడినట్టు పోలీసులు తెలిపారు. పాక్ సైన్యం కాల్పులకు స్పందించిన ఆర్మీ ఎదురు కాల్పులు జరిపినట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. లామ్ సెక్టార్లోనూ కాల్పులకు పాల్పడిందని పేర్కొన్నారు. పూంచ్ సెక్టార్లో బుధవారం ఉదయం 8:45 గంటల ప్రాంతంలో మోర్టార్లు, అత్యాధునిక ఆయుధాలతో దాడిచేసిందని, ఈ ఘటనలో ముగ్గురు సైనికులు గాయపడినట్లు పోలీస్ అధికారులు తెలియజేశారు.
పాక్ సైన్యం చర్యలపై ఆర్మీ కూడా ధీటుగా సమాధానం ఇచ్చిందని, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి అన్నారు. మంగళవారం పూంచ్ సెక్టార్లో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అక్టోబరు 2 న జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో పదేళ్ల బాలుడితోపాటు మైనర్ బాలిక ప్రాణాలు కోల్పోగా, 12 మంది గాయపడినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. షాపూర్, కెర్నీ, కస్బా సెక్టార్లో ఆర్మీ పోస్టులు, వందలాది మంది గ్రామస్థులను కూడా టార్గెట్ చేసింది. గత కొన్ని నెలలుగా పాకిస్థాన్ సైన్యం సరిహద్దుల్లో ఒప్పందాలను ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడుతోంది. గతవారం పూంచ్, భింభేర్ గలి సెక్టార్లో కాల్పులకు జరిపింది. అలాగే సెప్టెంబరు 24 న పూంచ్ జిల్లా బాలాకోటే సెక్టార్పై జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.
Latest News

ప్రమాదానికి గురైన ఏకైక అణు జలాంతర్గామి!
Read More
సెగ అప్పుడే మొదలైపోయింది.
Read More
నేనే రాజు నేనే మంత్రి సినిమా రివ్యూ
Read More
11.44 లక్షల పాన్ కార్డులు రద్దు..
Read More
‘జయజానకి నాయక’ రిలీజ్ డేట్ ఛేంజ్!
Read More
వెంకీ కొత్త సినిమా
Read More
శ్రీలంక 50/2
Read More
వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ..
Read More
భారత్కు గుడ్ న్యూస్!
Read More
'రంగస్థలం' టైటిల్కి అర్థం చెప్పిన సుకుమార్
Read More
ప్రపంచకప్లు గెలిచా.. కానీ ఆకలి..?
Read More
2 రోజులకి 5 కోట్లు చార్జ్ చేస్తున్న హీరోయిన్
Read More
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ.. ఏఐసీసీ నిర్ణయం
Read More
కోహ్లి ఫుల్ హ్యాపీ..!
Read More
వాళ్లు నిజమైన హీరోలు: పవన్
Read More
టీమిండియా ఆధిక్యం 498
Read More
బలపరీక్షలో నెగ్గిన నితీశ్ కుమార్
Read More
నంద్యాలపై ఈసీ సంచలన నిర్ణయం..!
Read More