తాజా వార్తలు

నంద్యాలపై ఈసీ సంచలన నిర్ణయం..!

నంద్యాల ఉప ఎన్నిక విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఒకింత ఆసక్తికర, కొంత సంచలనాత్మక నిర్ణయాన్నే తీసుకుంది. ఓటర్ల జాబితా విషయంలో ఈసీ వెలువరించిన నిర్ణయంతో దాదాపు పదిహేను వేల మంది ఓటు హక్కును కోల్పోతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ మరికొన్ని గంటల్లో విడుదల కానున్న నేపథ్యంలో ఓటర్ లిస్టుపై ఈసీ స్పష్టతను ఇచ్చింది. ఈ ఏడాది జనవరికి ముందు ఓటర్ల జాబితాలో పేర్లను కలిగిన వాళ్లు మాత్రమే ఉప ఎన్నికల్లో ఓటు వేయగలరు అని సీఈసీ స్పష్టం చేసింది.

జనవరి తర్వాత ఓటు హక్కు కోసం పేర్లను నమోదు చేసుకున్న వారెవరూ ఉప ఎన్నికలో ఓటు వేయలేరని తెలిపింది. ఇటీవల నంద్యాల్లో భారీ ఎత్తున కొత్త ఓట్లు నమోదు అయ్యాయి. దాదాపు పదిహేను వేల ఓట్లు ఇలా నమోదైనట్టు సమాచారం. భూమా నాగిరెడ్డి మరణంతో ఉప ఎన్నిక తథ్యమైన పరిస్థితుల మధ్య వీళ్ల పేర్లు ఓటర్ లిస్టులో నమోదు అయ్యాయి.



Latest News