ముగిసిన చార్మి విచారణ
డ్రగ్స్ వ్యవహారంలో అనుమానితులుగా ఉన్న చార్మీ ఈ రోజు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. చార్మిని తప్ప అమెతో వచ్చినవారెవరినీ అధికారులు లోపలికి అనుమతించలేదు. హైకోర్టు ఆదేశాల ప్రకారం సాయంత్రం 5 గంటల లోపు చార్మి విచారణ ముగించారు.
సిట్ కార్యాలయంలో చార్మిని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత, సీఐలు విజలక్మీ, శ్రీలత, రేణుక విచారణ చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకే వారు చార్మిని ప్రశ్నించారు. కెల్విన్ మొబైల్ లో ఆమె పేరు చార్మి దాదా పేరుతో ఉండడం, ఇద్దరి మధ్య వాట్సాప్ లో వెయ్యికి పైగా కన్వర్జేషన్ , జ్యోతి లక్ష్మీ ఫంక్షన్ లో కెల్విన్ తో సెల్ఫీలు దిగడం వంటి అంశాలపై సిట్ మహిళా అధికారుల బృందం చార్మిని ప్రశ్నించినట్లు తెలుస్తుంది.
కోర్టు ఆదేశాల ప్రకారం చార్మి రక్త నమూనాలు సేకరించని అధికారులు, మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని ఆమెకు తెలిపారు. చార్మి విచారణ సమయంలో వెల్లడించిన అంశాలను అధికారులు స్టేట్మెంట్గా రికార్డు చేశారు. ఈ విచారణ ఆరున్నర గంటల పాటు సాగింది. రేపు నటి ముమైత్ ఖాన్ను ఉదయం 10 గంటలకు సీట్ అధికారులు విచారించనున్నారు.