తాజా వార్తలు

విదేశాలు, పబ్బులకు వెళ్లడం నా హాబీ: పూరి

డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ సిట్ అధికారులు విచారణ కొనసాగుతోంది. పదిహేడేళ్ల కిందట సినీ పరిశ్రమకు వచ్చానని, ఇదే ప్రపంచమని, సినిమాల కోసమే తన బృందంతో పాటు బ్యాంకాక్ వెళ్తుంటానని విచారణలో పూరీ వెల్లడించినట్టు సమాచారం. అంతే కాదు పబ్స్, విదేశాలకు వెళ్లడం తన హాబీ అని, స్నేహితులు చాలా తక్కువ అని, తన సినిమాల్లో ప్రస్తుతం ఉన్న కల్చర్‌ని చూపెట్టే ప్రయత్నం చేస్తానని విచారణాధికారులతో పూరీ తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ ఉదయం విచారణ ప్రారంభించిన అధికారుల బృందం పూరిని ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే, పూరి మాత్రం ఏ మాత్రం తడబడకుండా సూటిగా, స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. కెల్విన్‌తో సంబంధాలపై అధికారులు అడిగిన ప్రశ్నకు పూరీ సూటిగానే సమాధానం ఇచ్చాడట. ఓ ఈవెంట్ సందర్భంగా పబ్ లో కెల్విన్ ను కలిసిన విషయం నిజమేనని ఒప్పుకున్న పూరి, ఆ తర్వాత మాత్రం కెల్విన్‌తో రెగ్యులర్‌గా ఎలాంటి సంభాషణలు జరగలేదని వెల్లడించాడు. సిట్ ఇంఛార్జి శ్రీనివాసరావు నేతృత్వంలో సాగుతోన్న విచారణను ఎక్సైజ్ ఈడీ అకున్ సబర్వాల్, చంద్రవదన పర్యవేక్షిస్తున్నారు. పూరీని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, మరో అధికారి శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు.



Latest News