తాజా వార్తలు

కోచ్‌లు వస్తుంటారు.. వెళ్తుంటారు..!

కోచ్‌లు వస్తుంటారు.. వెళ్తుంటారు కానీ.. భారత్ జట్టు ప్రయోజనాలే ఇక్కడ ముఖ్యమని ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఇటీవల నూతనంగా కోచ్‌ బాధ్యతలు స్వీకరించిన రవిశాస్త్రి.. భారత్ జట్టు సుదీర్ఘ సిరీస్‌ కోసం శ్రీలంక పర్యటనకి వెళ్లనున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడాడు. గడిచిన రెండు వారాల్లో జరిగిన ఘటనలు తనని పరిపక్వతతో ఆలోచించేలా చేసేయాని రవిశాస్త్రి వివరించారు.

‘రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే లాంటి వారు వస్తుంటారు.. వెళ్తుంటారు. కానీ.. జట్టు ఇక్కడ ముఖ్యం. కోచ్ ఎంపిక, బౌలింగ్ కోచ్‌ని ఎంచుకోవడం తదితర ఘటనలు నన్ను పరిపక్వతతో ఆలోచించేలా చేశాయి. అయితే.. ప్రస్తుతం నేను ఎలాంటి వివాదాలను మోసుకుని భారత్ జట్టులోకి రావడం లేదు’ అని రవిశాస్త్రి స్పష్టం చేశారు. మైదానంలో మెరుగైన ప్రదర్శన చేయాలంటే క్రికెటర్ మనసు ప్రశాంతంగా ఉండాలి.. అలానే తాను కోచ్‌‌గా బాధ్యతలు నిర్వర్తించాలని ఆశిస్తున్నట్లు ఈ కొత్త కోచ్ వివరించారు. జులై 26 నుంచి భారత్ జట్టు శ్రీలంకతో టెస్టు సిరీస్‌ ఆడనుంది.



Latest News