తాజా వార్తలు
'బ్రూస్ లీ' విలన్!
ఇండియన్ సెల్యులాయిడ్పై చరిత్ర సృష్టించిన 'బాహుబలి 2' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న అప్కమింగ్ మూవీ 'సాహో' ప్రస్తుతం సెట్స్పై వుంది. 'రన్ రాజా రన్' ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్తో పాటు బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే వంటి స్టార్స్ నటిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్ ఇందులో విలన్ పాత్ర పోషిస్తుండగా మరో కీలక పాత్రలో చుంకీ పాండే నటిస్తున్నారు.
ఇదిలావుంటే, తాజాగా ఈ సినిమాకు ఓ తమిళ నటుడు సైతం సైన్ చేశాడని తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా నటించిన బ్రూస్ లీ సినిమాలో విలన్ పాత్ర పోషించిన అరుణ్ విజయ్ సాహో సినిమాకు సైన్ చేసినట్టు టాలీవుడ్ టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం వుందంటున్నాయి సినీవర్గాలు.