తాజా వార్తలు

డ్రగ్ కేసులో కీలక మలుపు!

టాలీవుడ్‌ని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసులో పోలీసులు తీగ లాగితే ఒక్కొక్కరి డొంక కదులుతుంది. ఇప్పటికే 12 మందికి నోటీసులు అందించగా.. వారిలో పూరీ జగన్నాథ్, శ్యాం కె నాయుడు, తరుణ్, సుబ్బరాజులను విచారించిన పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. ఈరోజు అత్యంత కీలకంగా భావిస్తున్న నవదీప్‌ను విచారిస్తున్నారు. అయితే వీరి విచారణలో అనేక షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.

తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మేనేజర్ రోజో రో రోనిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయండం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నా వారి పేర్లు బయటకు రాలేదని ఓ టాప్ హీరోయిన్‌తో పాటు ఇండస్ట్రీలో బడా నిర్మాత ఫ్యామిలీకి కూడా ఈ డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్టు రూమర్స్ హల్ చేస్తున్నాయి. తాజాగా కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.



Latest News